హంద్రీనీవాకు నీరు బంద్
ABN , First Publish Date - 2021-04-13T05:42:34+05:30 IST
హంద్రీనీవా కాలువలో సో మవారం నీటి పారుదల నిలిచిపోయింది. 263 రోజుల నిరంతరాయ పంపింగ్ను ఉదయం ఐదున్నరకు ముచ్చు మర్రి పంపింగ్ వద్ద ఎత్తిపోతలను ఇరిగేషన్ అధికారులు నిలిపివేశారు.
పంపింగ్ నిలిపివేత
గుంతకల్లు, ఏప్రిల్ 12 : హంద్రీనీవా కాలువలో సో మవారం నీటి పారుదల నిలిచిపోయింది. 263 రోజుల నిరంతరాయ పంపింగ్ను ఉదయం ఐదున్నరకు ముచ్చు మర్రి పంపింగ్ వద్ద ఎత్తిపోతలను ఇరిగేషన్ అధికారులు నిలిపివేశారు. దీంతో సాయంత్రానికి జిల్లాలోని రాగుల పాడు వద్ద ఉన్న 8వ పంపు హౌస్ వద్ద కూడా ఎత్తిపో తలు నిలిచిపోయాయి. గత జూలై నుంచి ఇప్పటి వరకూ దాదాపు ఎనిమిదిన్నర నెలలపాటు నీటిని ఎత్తిపోసిన పంపులు ఒక్కసారిగా నిలిచిపోయాయి.
42 టీఎంసీల నీరు ఎత్తిపోత
2020 జూలై 23వ తేదీన ప్రారంభమైన హంద్రీనీవా ఎత్తిపోతలు 263 రోజులపాటు కొనసాగగా 42 టీఎంసీల నీరు ఈ ప్రాజెక్టులో పారింది. మార్చి 27వ తేదీ వరకూ మల్యాల పంపుల ద్వారా నీటిని అందించారు. డ్యాంలో నీరు అడుగంటడంతో మల్యాల పంపులకు విశ్రాంతినిచ్చి మార్చి 27వ తేదీ నుంచి కేసీ కెనాల్కు నీటిని పంపుచేసే ముచ్చుమర్రి పంపుల ద్వారా నీటిని హంద్రీనీవాకు మళ్లించారు. ఈ ప్రత్యామ్నాయ ప్రాజెక్టు పంపింగ్ ద్వారా 14 రోజులపా టు నీటిని ఎత్తిపోసి మరో రెండు టీఎంసీలు ఇచ్చారు. మొత్తంపైన 44 టీఎంసీలు నీరు వచ్చినట్లైంది. ఈ 44 టీఎంసీ ల్లో మొదటి దశలోని కర్నూలు జిల్లాకు 7 టీఎంసీలు, మొదటి దశలోని అనంతపురం జిల్లా, 2వ దశలోని మూ డు జిల్లాలకు 37 టీఎంసీలు లభించాయి.
ఆగిన అనుబంధ కాల్వల పారుదల
హంద్రీనీవాకు నీటి పారుదల నిలిచిపోవడంతో దాని ద్వారా చెరువులకు నీరందిస్తున్న అనుబంధ కాల్వల నీటి పారుదలకు కూడా బ్రేక్పడింది. వజ్రకరూరు మండలం గడేహోతూరు వద్ద ఉన్న డిస్ట్రిబ్యూటరీలకు నీటి పారుదల నిలిచింది. కసాపురం వద్ద ఉన్న తూము నుంచి పాత కొత్తచెరువుకు, జీ కొట్టాల వద్ద నుంచి జీఎ్సబీసీ ద్వారా చండ్రాయని కుంట రిజర్వాయరుకు, వైటీ చెరువు, గుత్తి చెరువులకు నీరందిస్తున్న ఉపకాల్వలకు సరఫరా నిలిచి పోయింది. అలాగే ఏబీసీ ద్వారా ఆలూరు చెరువుకు నీటి సరఫరా ఆగింది. గుంతకల్లు ఎస్ఎస్ ట్యాంకుకు కూడా తాగునీటి అవసరాలకు పంపింగ్ ఆగింది.