తిమ్మమ్మ మర్రిమానును సందర్శించిన సబ్ అడిషనల్ ఎస్పీ
ABN , First Publish Date - 2021-10-17T07:02:48+05:30 IST
మండలంలోని గూటిబైలు గ్రామం లో వెలసిన తిమ్మమ్మమర్రిమానును శని వారం సబ్ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలసి సందర్శిం చారు.
నంబులపూలకుంట, అక్టోబరు 16: మండలంలోని గూటిబైలు గ్రామం లో వెలసిన తిమ్మమ్మమర్రిమానును శని వారం సబ్ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలసి సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆలయ పూజా రులు సబ్అడిషన్ ఎస్పీకి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో తిమ్మమాంబ, బా లవీరయ్యలకు ప్రత్యేక పూజా కార్యక్ర మాల్లో వారు పాల్గొన్నారు. అనంతరం తిమ్మమ్మమర్రిమాను పరిశీలించారు. మ ర్రిమాను, తిమ్మమాంబ జీవిత చరిత్రను టూరిజం గైడు అనీల్, మనోహర్లు వారికి వివరించారు. ఆయన వెంట గాండ్లపెంట ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, జమేదార్ సుబ్ర మణ్యం తదితరులు పాల్గొన్నారు.
యోగి వేమన సమాధిని..
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో యోగివేమన సమాధిని సెబ్ అడిష నల్ ఎస్పీ రామ్మోహన్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రజాకవి యోగి వేమన జీవిత చరిత్రపై ఆరాతీసి, ఆలయ ప్రాంగణంలో ఉన్న పద్యాలను పరిశీలించారు. ఈయన వెంట ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, పోలీసులు ఉన్నారు.