రెండిళ్లలో చోరీ
ABN , First Publish Date - 2021-04-17T06:05:58+05:30 IST
స్థానిక బీసీ కాలనీలోని రెండిళ్లలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.85 వేల నగదు అ పహరించుకెళ్లినట్లు బాధితులు శుక్రవారం స్థానిక పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశారు.
ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.85వేల నగదు అపహరణ
గుత్తి, ఏప్రిల్ 16: స్థానిక బీసీ కాలనీలోని రెండిళ్లలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.85 వేల నగదు అ పహరించుకెళ్లినట్లు బాధితులు శుక్రవారం స్థానిక పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశారు. బీసీ కాలనీలో నివాసమున్న రాజశేఖర్ రెడ్డి, బాబయ్య వారివారి కుటుం బ సభ్యులతో రాత్రి మిద్దెలపై నిద్రపోయారు. ఇదే అదునుగా భావించిన దొంగలు రాజశేఖర్ రెడ్డి ఇం టి తలుపు తాళాలు ధ్వంసం చేసి, లోపలికి చొరబడ్డారు. బీరువా పగులగొట్టి అందులోని 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.85 వేల నగదు అపహరించారు. బా బయ్య ఇంటి బీరువాను కూడా పగలగొట్టి, అందులోని జత కమ్మలు, రూ.వెయ్యి అపహరించారు. శుక్రవారం తెల్లవారుజామున రాజశేఖర్ రెడ్డి నిద్రలేచి చూడగా.. ఇంటి తలుపులు తెరచి ఉండటాన్ని గమనించాడు. ఇంట్లోకెళ్లి చూడగా.. బీరువా ధ్వంసమై ఉంది. అందులో చూసుకోగా.. 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.85 వేలు కనబడలేదు. చోరీ అయినట్లు గ్రహించాడు. బాబయ్య కుటుంబికులు కూడా తెలుసుకున్నారు. వారు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు క్లూస్ టీంతో పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.