ఆనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-08-03T06:40:07+05:30 IST
నగర శివారు కాలనీలో ఆనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అనంతపురం క్రైం, ఆగస్టు 2 : నగర శివారు కాలనీలో ఆనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. నగర శివారులోని పిల్లిగుండ్ల కాలనీకి చెందిన తలారి రాముడు (51)భార్య రాధమ్మ కొన్నేళ్ల కిం దట చనిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆతడు కుమారుడు భానుప్రకాష్ వద్దనే ఉం టున్నాడు. ఒకవైపు ఆనారోగ్య సమస్యలతో పాటు భార్య మృతి చెందిందని మదనపడే వా డు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. కొంతసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు యువకుల ఘర్షణ
నగరంలో ఇద్దరు యువకుల మద్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మరో యువకుడి గొంతు కోయడం కలవరం రేపింది. వనటౌన పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని పాతూరులోని బంగారువీధిలో ఇద్దరు యువ కులు మునిస్వామి, వెంకటేష్ బంగరం షాపులలో స్వీపర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ తరచూ మద్యం తాగేవారు. సోమవారం రాత్రి తాగిన మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వెంకటేశు తన వద్ద ఉన్న కత్తితో ము నిస్వామి గొంతులో పొడిచాడు. స్థానికులు, వనటౌన పోలీసులు అక్కడికెళ్లి మునిస్వా మిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వనటౌన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.