కాందీశీకులకు స్వయం ఉపాధి అవకాశాలు
ABN , First Publish Date - 2021-07-24T06:03:33+05:30 IST
పట్టణంలోని శ్రీలంక కాలనీలో నివసిస్తున్న కాందీశీకుల కు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వా మీజీ పేర్కొన్నారు.

హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ
గుంతకల్లు టౌన్, జూలై 23: పట్టణంలోని శ్రీలంక కాలనీలో నివసిస్తున్న కాందీశీకుల కు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వా మీజీ పేర్కొన్నారు. స్థానిక శ్రీలంక కాలనీలో శుక్రవారం స్వామిజీ పర్యటించారు. వారి స మస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు వారి ఇబ్బందులను స్వామిజీకి తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ కాందీశీకులకు చిన్న, చిన్న వ్యాపారాలకు సంబంధించి సామగ్రిని ఉచితంగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ నలుగురు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంజుల వెంకటేశ్, సభ్యులు కేశవ, శ్రీధర్ రెడ్డి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.