విత్తన కాయల కోసం రిజిసే్ట్రషన చేయించుకోండి

ABN , First Publish Date - 2021-05-09T06:16:51+05:30 IST

డివిజనలోని మండలాల్లో మొదటి విడత వేరుశనగ రిజిసే్ట్రషన సోమవారం నుంచి ఆయా పంచాయతీ పరిధిలో ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభం అవుతాయని ఏడీఏ ఎస్‌ సత్యనారాయణ పేర్కొన్నారు.

విత్తన కాయల కోసం రిజిసే్ట్రషన చేయించుకోండి

ఏడీఏ సత్యనారాయణ

కదిరి, మే 8 :  డివిజనలోని మండలాల్లో మొదటి విడత వేరుశనగ రిజిసే్ట్రషన సోమవారం నుంచి ఆయా పంచాయతీ పరిధిలో ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభం అవుతాయని ఏడీఏ ఎస్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ మూడు విడతల్లో రిజిసే్ట్రషన, పంపిణీ కార్యక్రమం ఉంటుం దన్నారు. మొదటి విడత 10 నుంచి రిజిసే్ట్రషన, 17 నుంచి పంపిణీ , రెండో విడత 17నుంచి రిజిసే్ట్రషన, 24 నుంచి పంపిణీ, మూడో విడత 24 నుంచి రిజిసే్ట్రషన, 31 నుంచి పంపిణీ చేయడం జరుగుతుందన్నా రు. క్వింటాల్‌ పూర్తి ధర రూ. 8680, సబ్సిడీ ధర రూ. 3471, రైతు వాటా రూ. 5208 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 సెంట్లకు ఒక బ్యాగు, 51 సెంట్ల నుంచి ఎకరా ఉన్నవారికి రెండు బ్యాగులు, ఎకరం పైబడిన వారికి మూడు బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంద న్నారు. ప్రతి రైతు జిరాక్స్‌ కాపీ, సెల్‌ ఫోన తీసుకురావాలన్నారు. కదిరి డివిజన పరిధిలో 54 వేల క్వింటాళ్ళు విత్తన కాయలు , 61 వేల మంది రైతులకు ఈ ఖరీఫ్‌ సీజనలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

Updated Date - 2021-05-09T06:16:51+05:30 IST