రోగులకు మెరుగైన వైద్యం అందించండి

ABN , First Publish Date - 2021-06-17T06:18:35+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని పెనుకొండ ఇనచార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ మధుసూదన వైద్యులను ఆదేశించారు

రోగులకు మెరుగైన వైద్యం అందించండి
వైద్యులతో మాట్లాడుతున్న ఇనచార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ మధుసూదన

 ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని పెనుకొండ ఇనచార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ మధుసూదన వైద్యులను ఆదేశించారు. బుధవారం ఆయన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్‌కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఎంతమంది చికిత్స పొందుతున్నారు, ఆక్సిజన ఎంతమంది సరఫరా అవుతోంది అన్న అంశాలపై సిబ్బందితో ఆరా తీశారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఎంతమంది చికిత్స పొందారు, ఎంతమంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఎంతమంది మృతిచెందారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆక్సిజన ప్లాంట్‌ను, సిలిండర్లను తనిఖీ చేశారు. మొదటిసారిగా హిందూపురం విచ్చేసిన ఇనచార్జ్‌ సబ్‌ కలెక్టర్‌కు తహసీల్దార్‌ శ్రీనివాసులు, సౌజన్యలక్ష్మీ, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, సూపరింటెండెంట్‌ జోస్‌ఫలు పుష్పగుచ్చాలు అందజేశారు. 



Updated Date - 2021-06-17T06:18:35+05:30 IST