బకాయి వేతనాల కోసం నిరసన

ABN , First Publish Date - 2021-07-08T06:26:17+05:30 IST

తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు.

బకాయి వేతనాల కోసం నిరసన
డీటీకి వినతి పత్రం అందజేస్తున్న కార్మిక సంఘాల నాయకులు

కూడేరు, జూలై 7 : తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ  సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. ఈ నిరసనకు మద్ధతు తెలిపిన సీపీఐ మండల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ... కార్మికులు సమ్మెలో వెళ్తే... జిల్లా వ్యాప్తంగా 900 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా బకాయి వేతనాలు చెల్లించాలని అన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ కుమారస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. 


Updated Date - 2021-07-08T06:26:17+05:30 IST