రాంపురంలో ప్రబలిన విషజ్వరాలు

ABN , First Publish Date - 2021-09-29T06:11:27+05:30 IST

మండలంలోని రాంపురం గ్రామంలో విషజ్వరాలు ప్రబలి ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు.

రాంపురంలో ప్రబలిన విషజ్వరాలు
అనంతపురం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మౌనిక


- డెంగీ కేసు నమోదు 

కనగానపల్లి, సెప్టెంబరు28: మండలంలోని రాంపురం గ్రామంలో విషజ్వరాలు ప్రబలి ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు.  ఇప్పటికే జ్వరాల బారిన పడిన తనుశ్రీ, హాసిని, లావణ్య, వసుధ చిన్నారులు ఆసుపత్రిలో చికిత్సలు పొంది కొద్దిగా కోలుకున్నారు. గ్రామానికి చెందిన మౌనిక అనే గర్భిణి డెంగీ బారిన పడి అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతోంది. గ్రామంలోని ఆపరిశుభ్రత, తాగునీటి కాలుష్యంతోనే జ్వరాలు ప్రబలు తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేయాలని గ్రామప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-09-29T06:11:27+05:30 IST