సాగు భూములను ఆక్రమిస్తే ఉద్యమిస్తాం: సీపీఎం

ABN , First Publish Date - 2021-07-30T06:21:10+05:30 IST

మండలంలోని కడవకల్లు రెవెన్యూ గ్రామంలో సాగు చేసుకున్న భూములను ఆక్రమిస్తే ఉద్యమిస్తామని మండల సీపీఎం నాయకులు రామాంజనేయులు హెచ్చరించారు.

సాగు భూములను ఆక్రమిస్తే ఉద్యమిస్తాం: సీపీఎం
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు, బాధిత రైతులు

పుట్లూరు, జూలై 29: మండలంలోని కడవకల్లు రెవెన్యూ గ్రామంలో సాగు చేసుకున్న భూములను ఆక్రమిస్తే ఉద్యమిస్తామని మండల సీపీఎం నాయకులు రామాంజనేయులు హెచ్చరించారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సాగుదారులతో కలి సి ధర్నా నిర్వహించారు. తమకు తెలియకుండా ఎవరూ సాగు చేయకూడదంటూ ఎమ్మె ల్యే పద్మావతి అనుచరులు బెదిరిస్తున్నారని, భూములు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు, పోలీసులు స్పందించి సాగు చేసుకున్న నిరుపేదలకు న్యా యం చేయాలని కోరారు. 

Updated Date - 2021-07-30T06:21:10+05:30 IST