పోలవరం నిర్మాణంపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-02-23T18:17:14+05:30 IST
పోలవరం నిర్మాణంపై ఎన్జీటీ తీవ్రవ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన జాగ్రత్తలు..
న్యూఢిల్లీ: పోలవరం నిర్మాణంపై ఎన్జీటీ తీవ్రవ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడంలేదని పేర్కొంది. పర్యావరణ ప్రణాళికలను లోపభూయిష్టిగా రూపొందించారని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. సమస్యలు పదే పదే ఉత్పన్నం అవడానికి అదే కారణమని సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్తరాఖండ్లో జరిగిన ప్రళయం ఏపీలోనూ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నిపుణుల కమిటీ నిర్దేశాల ప్రకారం పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఎన్జీటీ కమిటీని నియమించనుంది.