శ్రీవారికి మోహినీ అలంకరణ
ABN , First Publish Date - 2021-10-14T06:36:33+05:30 IST
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీవారు శ్రీ మోహినీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
![శ్రీవారికి మోహినీ అలంకరణ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కదిరిఅర్బన్, అక్టోబరు 13: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీవారు శ్రీ మోహినీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి ఉభయ దారులుగా పట్టణానికి చెందిన మంగు రామారావు కుటుంబ సభ్యులు డాక్టర్ ఎంవీ రమణమూర్తి, డాక్టర్ ఎంవీ హనుమంతరావు వ్యవహరించారు. అదేవిధంగా చౌడేశ్వరి అమ్మవారు దుర్గాదేవీ, కన్యకాపరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్థిని, మరకతమహాలక్ష్మీదేవీ అమ్మవారు దుర్గాదేవీ అలం కరణలో భక్తులకు దర్శనమిచ్చారు.