రేపు మెగా రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2021-01-17T06:18:50+05:30 IST

ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా సోమవారం హిం దూపురంలో లెజెండరీ మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకు లు వెల్లడించారు.

రేపు మెగా రక్తదాన శిబిరం

విజయవంతం చేయాలని టీడీపీ నాయకుల పిలుపు

హిందూపురం, జనవరి 16: ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా సోమవారం హిం దూపురంలో లెజెండరీ మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకు లు వెల్లడించారు. శనివారం ఎ మ్మెల్యే బాలకృష్ణ  స్వగృహంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు సమావేశం ని ర్వహించారు. ఈసందర్భంగా అహుడా మాజీ  చైర్మన అంబికా ల క్ష్మీనారాయణ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొ ల్లకుంట అంజిన ప్ప, టీడీపీ పట్టణ, రూరల్‌ మండల కన్వీనర్లు రమేష్‌, అశ్వత్థనారాయణలు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వర్థంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు చౌడేశ్వరీ కాలనీలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు అమర్‌నా థ్‌, మాజీ జెడ్పీటీసీ ఆదినారాయణ, ఉమాశంకరరెడ్డి, భాస్కర్‌, హెచఎంరాము, రాఘవేంద్ర, శీనా, ముక్తీయ ర్‌, దాదాపీర్‌, శివకుమార్‌, శ్రీనివాసులు, దర్గానవీన, చంద్రమోహన, అంజాద్‌, మూర్తి, నజీర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T06:18:50+05:30 IST