రైలు కింద పడి లారీడ్రైవర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-30T06:04:44+05:30 IST
మండలంలోని రాయలచెరువు వద్ద శనివారం కడప జిల్లా యర్రగుంట్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సునీ ల్ (42) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకు న్నాడు.
![రైలు కింద పడి లారీడ్రైవర్ ఆత్మహత్య](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మృతుడు కడప జిల్లా యర్రగుంట్ల వాసిగా గుర్తింపు
యాడికి, మే 29: మండలంలోని రాయలచెరువు వద్ద శనివారం కడప జిల్లా యర్రగుంట్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సునీ ల్ (42) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకు న్నాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. తెల్లవారుజామున రాయలచెరువు చందనగేట్ స మీపాన రోడ్డు పక్కన సునీల్ లారీని నిలబె ట్టాడు. సమీపంలో ఉన్న రైలు పట్టాలపై ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ట్రాక్మెన అ క్కడే పడి ఉన్న సెల్ఫోన ఆధారంగా మృతుడిది కడప జిల్లా యర్రగుంట్ల గ్రామవాసిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. రై ల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.