మహాసమాధిని దర్శించుకున్న జడ్జిలు
ABN , First Publish Date - 2021-12-25T06:04:12+05:30 IST
అలహాబాద్ హైకోర్టు జడ్జిలు జస్టిస్ పీ దివాకర్, అశ్విన్కుమార్ మిశ్రాలు శుక్రవారం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
![మహాసమాధిని దర్శించుకున్న జడ్జిలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122512332324/12252021003406n80.jpg)
పుట్టపర్తి, డిసెంబరు 24: అలహాబాద్ హైకోర్టు జడ్జిలు జస్టిస్ పీ దివాకర్, అశ్విన్కుమార్ మిశ్రాలు శుక్రవారం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. బెంగుళూర్ నుండి రోడ్డు మార్గాన పుట్టపర్తికి చేరుకున్నారు. వీరికి ధర్మవరం జూనియర్ సివిల్జడ్జి శివపార్వతి, ట్రస్టుసభ్యులు ఆర్జే రత్నాకర్, సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం సాయికుల్వంతుకు వెళ్లి సత్యసాయి మహాసమా ధిని దర్శించుకున్నారు.