చిరు ఫ్యాన్స రాష్ట్ర మాజీ అధ్యక్షుడి మృతి

ABN , First Publish Date - 2021-04-21T05:34:02+05:30 IST

చిరంజీవి యువత రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతిచెందాడు.

చిరు ఫ్యాన్స రాష్ట్ర మాజీ అధ్యక్షుడి మృతి
ప్రసాద్‌రెడ్డి (ఫైల్‌)

హిందూపురం టౌన, ఏపిల్ర్‌ 20: చిరంజీవి యువత రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈయన గతంలో చిరంజీవి ఫ్యాన్సలో చురుకైన పాత్ర పోషించాడు. హిందూపురం ప్రాంతంలో సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండేవాడు. ఆయన అకాలమరణంతో చిరు అభిమానులు దిగ్ర్బాంతికి గురయ్యారు. ఈయన మృతి విషయం తెలుసుకున్న సినీనటుడు నాగేంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతని కుటుంబానికి మా అభిమానులు ఎప్పటికీ అండగా ఉంటారని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-04-21T05:34:02+05:30 IST