‘స్పందించు- ఆక్సిజన అందించు’కు రూ. 1.30 లక్షలు విరాళం

ABN , First Publish Date - 2021-05-05T06:05:39+05:30 IST

కరోనా నేపథ్యంలో ఆర్డీటీ చేపట్టిన ‘స్పందించు- ఆక్సిజన అందించు’ కార్యక్రమానికి నగరంలోని విటల్‌ బిల్డింగ్‌ నిర్వాహకులు ఎల్‌ఎస్‌ రామనాథ్‌ రావు, ఫుట్‌ బాల్‌ అసోసి యేషన సభ్యులు వేణు, సురేష్‌ ఆచారి, భాస్కర్‌రెడ్డి స్వచ్ఛందంగా రూ. 1.30లక్షలను వి రాళంగా ప్రకటించారు.

‘స్పందించు- ఆక్సిజన అందించు’కు   రూ. 1.30 లక్షలు విరాళం
మాంచోఫెర్రర్‌కు చెక్‌ను అందజేస్తున్న సురేష్‌ఆచారి

అనంతపురం క్రైం, మే4 : కరోనా నేపథ్యంలో ఆర్డీటీ చేపట్టిన ‘స్పందించు- ఆక్సిజన అందించు’ కార్యక్రమానికి నగరంలోని విటల్‌ బిల్డింగ్‌ నిర్వాహకులు ఎల్‌ఎస్‌ రామనాథ్‌ రావు, ఫుట్‌ బాల్‌ అసోసి యేషన సభ్యులు వేణు, సురేష్‌ ఆచారి, భాస్కర్‌రెడ్డి స్వచ్ఛందంగా రూ. 1.30లక్షలను వి రాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం వారంద రూ ఆర్డీటీలో మాంచో ఫెర్రర్‌ను కలిసి సంబంధిత చెక్కుల ను అందజేశారు. అనంతరం సురేష్‌ ఆచారి మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్యసేవలందించాలనే ఉద్దేశ్యం తో మానవ తాదృక్పథంతో అందరూ కలిసి ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. విటల్‌ బిల్డింగ్‌ ఎల్‌ఎస్‌ రామ్‌నా థ్‌రావు రూ. లక్ష, పుట్‌బాల్‌ అసోసియేషన సభ్యుడు వేణు రూ.15,000, సురేష్‌ ఆచారి రూ.10,000, భాస్కర్‌రెడ్డి రూ.5000 చొప్పును ఆర్థిక సాయం అందించారు.

Updated Date - 2021-05-05T06:05:39+05:30 IST