ప్లాస్టిక్ బియ్యం వదంతులు నమ్మొద్దు : ఐసీడీఎస్ పీడీ
ABN , First Publish Date - 2021-10-19T06:05:23+05:30 IST
అంగనవాడీల ద్వారా సరఫరా చేస్తున్నది ప్లాస్టిక్ బియ్యం అంటూ అనేకచోట్ల వదంతులు సృష్టిస్తున్నారనీ, వాటిని నమ్మొద్దని ఐసీడీఎస్ పీడీ సుజన తెలిపారు.
![ప్లాస్టిక్ బియ్యం వదంతులు నమ్మొద్దు : ఐసీడీఎస్ పీడీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అనంతపురం వైద్యం, అక్టోబరు 18: అంగనవాడీల ద్వారా సరఫరా చేస్తున్నది ప్లాస్టిక్ బియ్యం అంటూ అనేకచోట్ల వదంతులు సృష్టిస్తున్నారనీ, వాటిని నమ్మొద్దని ఐసీడీఎస్ పీడీ సుజన తెలిపారు. సోమవారం ఆమె ఈ వదంతులపై వివరణ ఇచ్చారు. అంగనవాడీ కేంద్రాలకు పౌరసరఫరాల సంస్థ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను సరఫరా చేస్తున్నామన్నారు. కొంతమంది లబ్ధిదారులతోపాటు స్థానికులు ప్లాస్టిక్ బియ్యం అంటూ అపోహలతో తమ దృష్టికి తెస్తున్నారన్నారు. ఈ రైస్ను ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపామన్నారు. అక్కడ కూడా ఈ రైస్ హానికరం కాదని పైగా పౌష్టికాహార లోపం ఉన్నవారికి ఎంతో ఉపయోగపడతాయని సర్టిఫై చేసి, ఇచ్చారన్నారు. అందుకే ఫోర్టిఫైడ్ రైస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అసవరం లేదని పీడీ కోరారు.