డిగ్రీ లెక్చరర్‌ రాత పరీక్షల్లో మహిళా పోలీసు ప్రతిభ

ABN , First Publish Date - 2021-07-21T06:35:22+05:30 IST

మం డల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తూ డిగ్రీ లెక్చరర్‌ రాత పరీక్షలలో స్టేట్‌లో 20వ ర్యాంక్‌ సాధించి, అధ్యాపక పోస్టు సాధించి, విధుల్లో చేరుతున్న మహిళా పోలీసు చిట్వేల్‌ సల్మాకు మంగళవారం అధికారులు, మహి ళా పోలీసులు, గ్రామ సచివాలయం ఉద్యోగు లు, వలంటీర్లు ఘనంగా సన్మానించారు.

డిగ్రీ లెక్చరర్‌ రాత పరీక్షల్లో మహిళా పోలీసు ప్రతిభ
సల్మాను సన్మానిస్తున్న దృశ్యం

ఘనంగా సన్మానించిన అధికారులు, సిబ్బంది

ఓబుళదేవరచెరువు, జూలై 20: మం డల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తూ డిగ్రీ లెక్చరర్‌ రాత పరీక్షలలో స్టేట్‌లో 20వ ర్యాంక్‌ సాధించి, అధ్యాపక పోస్టు సాధించి, విధుల్లో చేరుతున్న మహిళా పోలీసు చిట్వేల్‌ సల్మాకు మంగళవారం అధికారులు, మహి ళా పోలీసులు, గ్రామ సచివాలయం ఉద్యోగు లు, వలంటీర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రఘునాథగుప్తా, గ్రామ కార్యదర్శులు గౌస్‌సాహెబ్‌, రామలింగారెడ్డి మా ట్లాడుతూ మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తూ డిగ్రీ కళాశాల అధ్యాపకు రాలిగా ఎంపికై నెల్లూరు డీకేడబ్ల్యూ మహిళా ప్రభుత్వ డిగ్రీ  కళాశాలలో అధ్యాపకురాలుగా నియమించిన సందర్భంగా ఆమెకు అభినందించారు. అనంతరం జ్ఞాపికను ఆమెకు అందజేశారు. ఈ కార్య క్రమంలో సర్పంచు గోవిందు, సచివాలయ సిబ్బంది, ఓం ప్రకాశ్‌, రాజశేఖర్‌రెడ్డి, సలీం, హరి, ఆరోగ్య కార్యకర్తలు నాగవేణి, గంగాదేవీ, మహిళా పోలీసు తుమ్మలకుంట్లపల్లి గౌసియాతో పాటు మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-21T06:35:22+05:30 IST