కొత్తగా ముగ్గురికి కరోనా
ABN , First Publish Date - 2021-10-14T06:25:17+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురికి కరోనా సోకినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు.
![కొత్తగా ముగ్గురికి కరోనా](https://media.andhrajyothy.com/appimg/galleries/1921101412460380/10142021005510n92.jpg)
అనంతపురం వైద్యం, అక్టోబరు13: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురికి కరోనా సోకినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. కొత్తగా మరణాలు నమోదు కాలేదు. జిల్లాలో అధికారిక లెక్కల మేరకు ఇప్పటి వరకు 157709 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1093 మంది మరణించగా 156550 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 66 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.