శెట్టిపల్లిలో ఘర్షణ : ఒకరికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2021-06-22T05:25:37+05:30 IST
మండలంలోని శెట్టిపల్లిలో క్రికెట్ ఆడుతూ ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో మాదిగ వెంకటేశులు తీవ్రంగా గాయపడ్డారు.
![శెట్టిపల్లిలో ఘర్షణ : ఒకరికి తీవ్రగాయాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పెనుకొండ రూరల్, జూన 21: మండలంలోని శెట్టిపల్లిలో క్రికెట్ ఆడుతూ ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో మాదిగ వెంకటేశులు తీవ్రంగా గాయపడ్డారు. బీసీ కాలనీలో క్రికెట్ ఆడుతుండగా పాతకక్షలు మనసులో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన గాండ్ల ఈశ్వర్, మరికొంతమంది కర్రలు, రాళ్లు, బాటిల్తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని బాధిత వెంకటేశ తెలిపాడు. ఈ ఘటనపై పోలీ్సస్టేషనలో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు.