ఘనంగా ముగిసిన బాబయ్య గంధ మహోత్సవం
ABN , First Publish Date - 2021-01-27T07:04:31+05:30 IST
బాబయ్యస్వామి 748 గంధంపూజ మహోత్సవం ఘనంగా ముగిసింది. సోమవారం రాత్రి ఒంటి గంటకు దర్గాపీఠాధిపతి తాజ్బాబా తన స్వగృహం నుంచి గంధాన్ని శిరస్సుపై ఉంచుకుని భక్తులు వెంటరాగా ఫకీర్ల విన్యాసాలతో మేళతాళాలు నడుమ గంఽధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లారు.
పెనుకొండ, జనవరి 26 : బాబయ్యస్వామి 748 గంధంపూజ మహోత్సవం ఘనంగా ముగిసింది. సోమవారం రాత్రి ఒంటి గంటకు దర్గాపీఠాధిపతి తాజ్బాబా తన స్వగృహం నుంచి గంధాన్ని శిరస్సుపై ఉంచుకుని భక్తులు వెంటరాగా ఫకీర్ల విన్యాసాలతో మేళతాళాలు నడుమ గంఽధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లారు. స్వామి సమాధిపై ఉంచి పూజలు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్గాలోని స్వామిని దర్శించడానికి ఉదయం 6నుంచి 9గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతినిచ్చారు. రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారుజాము 3గంటల వరకు పూజా కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం దీపాలు సందర్భంగా భక్తులు దర్గావద్ద కొబ్బెరకాల్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ, ఎస్ఎ్సఓ రవిశంకర్ గురూజీ తదితరులు పాల్గొన్నారు.