భక్తిశ్రద్ధలతో అయ్యప్ప బ్రహ్మరథోత్సవం

ABN , First Publish Date - 2021-12-26T05:36:15+05:30 IST

అయ్యప్ప నామస్మరణ నడుమ శనివారం వైభవంగా అయ్యప్ప బ్రహ్మ రథోత్సవం జరిగింది.

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప బ్రహ్మరథోత్సవం
రథాన్ని లాగుతున్న భక్తులు

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 25 : అయ్యప్ప నామస్మరణ నడుమ శనివారం వైభవంగా అయ్యప్ప బ్రహ్మ రథోత్సవం జరిగింది. మండలంలోని ఎం. కొత్తపల్లి బండపై వెలిసిన అయ్యప్ప ఆలయంలో శనివారం వైభవంగా 9వ బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్మా ణ సంకల్పకులు పచ్చర్ల అంజినేయులు నాయుడు పూజలు నిర్వహించి ఈశ్వరీదేవి మాలధారణ గురువు అరిగిరి నారాయణస్వామి ముఖ్య ప్రవచితిగా పాల్గొని ఉపదేశాలు ఇచ్చారు. ఉదయం 6.30 మోకుతో లాగే రథంపైఅయ్యప్ప అఽశీనులయ్యారు. భక్తుల దర్శనార్థం వడ్డివారిపల్లి, మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం, అంబేద్కర్‌ సర్కిల్‌, బీఎస్‌ఎన్‌ల్‌ టవర్‌ మీదుగా ఊరేగింపు నిర్వహించారు. మధ్యహ్నం ఆలయానికి చేరుకొని, స్వామివారికి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం వందలాది భక్తులకు అన్న వితరణ చేశారు.

Updated Date - 2021-12-26T05:36:15+05:30 IST