విత్తన వేరుశనగ పంపిణీ గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-06-21T06:29:36+05:30 IST
జి ల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ గ డువును మరికొన్ని రోజులు పొడిగించా రు.
![విత్తన వేరుశనగ పంపిణీ గడువు పొడిగింపు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921062112584264/06212021005928n93.jpg)
అనంతపురం వ్యవసాయం, జూన్ 20: జి ల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ గ డువును మరికొన్ని రోజులు పొడిగించా రు. ఇదివరకు వేరుశనగ పంపిణీకి ఆదివారం ఆఖరు రోజుగా వ్యవసాయ శా ఖ ప్రకటించింది. క్షేత్ర స్థాయిలో లక్ష్యం మేరకు విత్తనకాయల పంపిణీ ముందు కు సాగకపోవడంతో మరికొన్ని రోజులు గ డువు పొడిగించారు. త్వరలో ఆఖరు తేదీని ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని పలు రైతు భరోసా కేంద్రాల్లో ఆదివారం వేరుశనగ పంపిణీ కొనసాగింది. ఇప్పటిదాకా 2.30 లక్షల మంది రైతులకు 1.97 లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు పంపిణీ చేశారు.