1.6 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు
ABN , First Publish Date - 2021-04-14T06:43:25+05:30 IST
జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం వరకు 1.6 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు చేసినట్లు ఇన్చార్జి జేడీఏ రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్ 13: జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం వరకు 1.6 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు చేసినట్లు ఇన్చార్జి జేడీఏ రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రబీ సీజన్లో పండించిన వేరుశనగ పం టలో 3 లక్షల క్వింటాళ్లను ఏపీ సీడ్స్, ఎన్ఎ్ససీ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. రబీలో వేరుశనగ పండించిన రైతు లు.. అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.