ముగ్గురు మట్కాబీటర్ల అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-30T06:05:51+05:30 IST
స్థానికంగా ముగ్గురు మట్కాబీటర్లను అరెస్ట్ చేసిన ట్లు పామిడి రూరల్ సీఐ రవిశంకర్రెడ్డి, ఎస్ఐ రాంభూపాల్ శనివారం తెలిపారు.
![ముగ్గురు మట్కాబీటర్ల అరెస్ట్](https://media.andhrajyothy.com/appimg/galleries/1921053012344054/05302021003514n28.jpg)
రూ.71890 స్వాధీనం
యాడికి, మే 29: స్థానికంగా ముగ్గురు మట్కాబీటర్లను అరెస్ట్ చేసిన ట్లు పామిడి రూరల్ సీఐ రవిశంకర్రెడ్డి, ఎస్ఐ రాంభూపాల్ శనివారం తెలిపారు. సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసి మట్కాబీట ర్లు ఖాదర్బాషా, ఆదాం, రంగస్వామిలను అరె్స్ట చేశామన్నారు. వారివద్ద నుంచి రూ.71890 నగదు, 16 మట్కాపట్టీలను స్వాధీనం చేసుకున్నామ న్నారు. దాడుల్లో ఏఎ్సఐ వెంకటేష్, హెడ్కానిస్టేబుల్ జాషువా, కానిస్టేబు ళ్లు భూపతిరాజు, రవీంద్రారెడ్డి, శేఖర్యాదవ్ పాల్గొన్నారు.