పోలీసులతో Paritala sriram వాగ్వాదం
ABN , First Publish Date - 2021-10-20T16:02:07+05:30 IST
మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంద్లో పాల్గొనేందుకు వెళ్తున్న పరిటాల సునీత, శ్రీరామ్ను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు కూడా వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులతో పరిటాల శ్రీరామ్ వాగ్వాదానికి దిగారు. చివరకు పరిటాల సునీత, శ్రీరామ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వెంకటాపురం మారుమోగుతోంది.