గుత్తి పోలీస్ స్టేషన్ నుండి దొంగ పరారీ
ABN , First Publish Date - 2021-01-25T15:34:52+05:30 IST
జిల్లాలోని గుత్తి పోలీస్ స్టేషన్ నుండి పోలీసుల కళ్లుగప్పి దుండగుడు నాగిరెడ్డి పరారయ్యాడు.
అనంతపురం: జిల్లాలోని గుత్తి పోలీస్ స్టేషన్ నుండి పోలీసుల కళ్లుగప్పి దుండగుడు నాగిరెడ్డి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగను పట్టుకునేందుకు వెంబడించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రవీంద్రపై దొంగ నాగిరెడ్డి దాడి చేసి పరారయ్యాడు. దుండగుడి దాడిలో కానిస్టేబుల్ గాయపడ్డాడు. మరోవైపు పరారైన దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.