పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , First Publish Date - 2021-12-20T04:58:56+05:30 IST
తాము చదువుకున్న పాఠశాల, తమకు విద్యను బోదించిన గురువులను పాతికేళ్ళ తర్వాత కలుసుకున్న విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాప కాలతో మైమరచిపోయారు,
![పూర్వ విద్యార్థుల సమ్మేళనం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921121911280367/12192021232845n54.jpg)
పుట్టపర్తిరూరల్, డిసెంబరు 19: తాము చదువుకున్న పాఠశాల, తమకు విద్యను బోదించిన గురువులను పాతికేళ్ళ తర్వాత కలుసుకున్న విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాప కాలతో మైమరచిపోయారు, తీపి జ్ఞాపకాలను గురువులతో పంచుకుంటూ పులకించి పోయారు. ఈమేరకు ఆదివారం పుట్టపర్తిలోని ఈశ్వరమ్మ ఉన్నతపాఠశాల 1995 పదో తరగతి చదువుకున్న పూర్వవిద్యార్థుల సమావేశం అయ్యారు. తమకు విద్యాబుద్దులను నేర్పి న గురువులను పూలమాలలు దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు.