ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2021-10-27T06:23:51+05:30 IST
కేజీబీవీల ప్రత్యేకా ధి కారు లు స్పృహతో వి ధులు నిర్వహించాలనీ, రాతపూర్వకంగా ఫిర్యాదులు అందితే స హించేది లేదని ఏపీసీ తిలక్ విద్యాసాగర్ హెచ్చరించారు
రాజకీయాల్లో జోక్యం చేసుకోకండి.. ఎస్ఓల సమావేశంలో ఏపీసీ తిలక్
అనంతపురం విద్య, అక్టోబరు 26: కేజీబీవీల ప్రత్యేకా ధి కారు లు స్పృహతో వి ధులు నిర్వహించాలనీ, రాతపూర్వకంగా ఫిర్యాదులు అందితే స హించేది లేదని ఏపీసీ తిలక్ విద్యాసాగర్ హెచ్చరించారు. మంగళవారం అన్ని కేజీబీవీల ఎస్ఓలతో బుక్కరాయసముద్రం కేజీబీవీలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కొన్ని కేజీబీవీల ఎస్ఓలు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నారు. కొన్ని కేజీబీవీల్లో ఎస్ఓలు తాము చక్రవర్తులమన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కింది స్థాయి ఉద్యోగులను తొలగించే వరకూ వెళ్తున్నారన్నారు. ఎస్ఓలకు ఆ అధికారం లేదన్నారు. స మస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బోధన, మెనూపై దృష్టి సారించాలన్నారు. సీఎఫ్ఎంఎ్సలో రెండు నెలలు మాత్రమే జీతాలు, ఇతర ఖర్చుల చెల్లింపులు ఉండే అవకాశం ఉందన్నారు. తర్వాత పీఎ్ఫఎంఎస్ ద్వారా ఉండబోతున్నాయన్నారు. అంతకుముందు చైల్డ్లైన్ 1098, ఆ ర్డీటీ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో బాలల హక్కులు, రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో జీసీడీఓ రెబెకా, అసిస్టెంట్ జీసీడీఓ కవిత, శ్రీనివాసులు, ఎస్ఓలు పాల్గొన్నారు.