రహదారుల పనులు వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2021-04-13T05:43:33+05:30 IST
జాతీయ అభివృద్ధి బ్యాంకు ద్వారా చేపడుతున్న రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ.. సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులకు మంత్రి శంకర్నారాయణ ఆదేశం
అనంతపురం, ఏప్రిల్12 (ఆంధ్రజ్యోతి): జాతీయ అభివృద్ధి బ్యాంకు ద్వారా చేపడుతున్న రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం స్థానిక రోడ్లు, భవనాల అతిథి గృహంలో జాతీయ అభివృద్ధి బ్యాం కు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రహదారుల పనులపై ఆ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రహదారుల అభివృద్ధి పనుల్లో ఆలస్యం మంచిదికాదని కాంట్రాక్టర్లకు సూచించారు. పనులు వేగవంతం చేయటంతోపాటు గడువులోగా పూర్తి చేయాలన్నారు. రహదారుల అభివృద్ధి పనులను ఎ ప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంలో ఆయన ఏ పనులు ఎక్కడిదాకా వచ్చాయి, ఎంత వరకూ పూర్తయ్యాయి? తదితర వివరాలను సంబంధిత అధికారులతో తెలుసుకున్నారు.