పోలీసు స్పందనకు 104 ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-01-19T07:06:45+05:30 IST
పోలీసుశాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా సోమవారం ని ర్వహించిన పోలీసు స్పందనలో బాధిత ప్రజల నుంచి 104 ఫిర్యాదులు అందాయి.
అనంతపురం క్రైం, జనవరి 18: పోలీసుశాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా సోమవారం ని ర్వహించిన పోలీసు స్పందనలో బాధిత ప్రజల నుంచి 104 ఫిర్యాదులు అందాయి. స్థానిక డీ పీఓలో ఎస్పీ సత్యఏసుబాబు 83, జిల్లావ్యాప్తం గా ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో సీఐలు, ఎస్ఐలు 21 ఫిర్యాదులు స్వీకరించారు.
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు..
హిందూపురంలోని ఆటోనగర్కు చెందిన నబీరసూల్ అనే వ్యక్తి తన కుమారులకు ఉద్యోగం ఇప్పిస్తానని నా లుగేళ్ల కిందట రూ.2 లక్షలు తీసుకుని, మోసం చేశాడని ఆత్మకూరు మండలానికి చెందిన తులసమ్మ స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పోలీసులకు పిర్యాదు చేసినా న్యాయం చేకూరలేదని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
ఉద్యోగం వచ్చాక వదిలేశాడు..
ఉద్యోగం వచ్చాక భర్త తనను మోసం చేశాడని బా ధితురాలు ఆదినారాయణమ్మ స్పందనలో ఆవేదన చెం దింది. ముదిగుబ్బ మండలం గాం డ్లవారిపల్లికి చెందిన తనకు శంకరనారాయణతో 1985లో వి వాహమైందని తెలిపింది. తమకు ఇ ద్దరు పిల్లలు పుట్టాక భర్త శంకరనారాయణకు టీ చర్ ఉద్యోగం వచ్చిందనీ, తర్వాత కొన్నేళ్లు బాగా నే ఉన్నామని పేర్కొంది. ఉద్యోగరీత్యా ఆయనకు పరిచయమైన మరో టీచర్ను పెళ్లి చేసుకుని, త నను, పిల్లలను పట్టించుకోవట్లేదని ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంది.