విద్యుత్షాక్తో యువరైతు మృతి
ABN , First Publish Date - 2020-08-13T10:01:36+05:30 IST
విద్యుత్షాక్తో యువరైతు మృతి చెందాడు. పరిగి మండలం బర్కత్పల్లి గ్రామానికి చెందిన రుమ్మ రాజు(30), బుధవారం పొలం దగ్గర పత్తిచేనుకు మందును పిచికారి
పరిగి: విద్యుత్షాక్తో యువరైతు మృతి చెందాడు. పరిగి మండలం బర్కత్పల్లి గ్రామానికి చెందిన రుమ్మ రాజు(30), బుధవారం పొలం దగ్గర పత్తిచేనుకు మందును పిచికారి చేశాడు. తర్వాత బోరుమోటారును స్టార్ట్ చేసేందుకు వెళ్లగా దానికి వైరు తేలి ఉండడంతో రాజు విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.