ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే
ABN , First Publish Date - 2020-05-29T09:50:36+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వలస కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ
వలస కార్మికుల బతుకులు దుర్భరం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నర్సింహారావు
మేడ్చల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వలస కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ.నర్సింహారావు ఆరోపించారు. గురువారం కండ్లకోయ ఓఆర్ఆర్ వద్ద వలస కార్మికులకు అరటిపండ్లు, మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగం, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యం, కార్యదర్శివర్గ సభ్యులు చంద్రశేఖర్, అశోక్, భాస్కర్, రాజశేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.