అర్హులైన వారికి రేషన్ కార్డులివ్వాలి
ABN , First Publish Date - 2020-06-02T09:14:29+05:30 IST
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డ్డులు మంజూరు చేయాలని సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన
ఇబ్రహీంపట్నం: అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డ్డులు మంజూరు చేయాలని సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కోర్కమిటీ సభ్యుడు సామేల్ మాట్లాడుతూ 2016 నుంచి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో చాలామంది పేదలు దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు రేషన్కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, ఎల్లేష్, యాదగిరి తదితరులు ఉన్నారు.