వివాహేతర సంబంధం అనుమానంతో వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-10-25T05:34:26+05:30 IST
వివాహేతర సం బంధం అనుమానంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘన తాండూ రుమండలం రాంపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.
గొడ్డలితో నరికిన నిందితుడు పొలంలో పడేసిన మృతదేహం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
తాండూరు రూరల్ : వివాహేతర సంబంధం అనుమానంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘన తాండూరు మండలం రాంపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన సతీష్ (32) శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి తలుపుతట్టాడు. రాంచంద్రారెడ్డి తన భార్య సతీష్ వెంట వెళ్లడాన్ని గమనించాడు. ఇరువురి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రాంచంద్రారెడ్డి ఇరువురిని వెంబడించాడు. ఈ క్రమంలో అతని భార్య తప్పించుకుంది. సతీష్ దొరికిపోగా, రాంచంద్రారెడ్డి తనవెంట తెచ్చుకున్న గొడ్డలితో అతనితలపై నరికి హత్య చేశాడు. మృతదేహాన్ని ఊరిచివర పొలంలోపడేశాడు. శనివారం తెల్లవారు జామున నిందితుడు రాంచంద్రారెడ్డి కరన్కోట్ పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.