ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-07T06:46:46+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి వెబ్‌ఐసైట్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్యెల్యే

ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి 


కొడంగల్‌/బొంరా్‌సపేట్‌/దౌల్తాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి వెబ్‌ఐసైట్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్యెల్యే పట్నంనరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులతో ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి వెబ్‌సైట్‌లపై స్థానిక పశువైద్యశాల భవనంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మెన్‌ జగదీశ్వర్‌రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ ఉషారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


కాగా, బొంరా్‌సపేట్‌లో మరుగుదొడ్లను నిర్మించుకున్న వారికి రూ.16 లక్షల చెక్కులను  పారితోషికంగా అందజేసినట్లు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్‌ ఎంపీపీ శేరినారాయణరెడ్డి, ఎంపీటీసీ శ్రావణ్‌గౌడ్‌, ఎంపీడీఓ హరినందన్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, కోట్లయాదగిరి, దేశ్యనాయక్‌, రామకృష్ణయాదవ్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


సీఎం సహాయ నిధి పేదలకు వరం

 సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరమని ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్‌లో మండలంలోని సుల్తాన్‌పూర్‌, మాటూర్‌ గ్రామాలకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందించారు. జడ్పీటీసీ కోట్లమహిపాల్‌, ఎంపీపీ విజయ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ భీములు, ప్రమోద్‌రావు, మోహన్‌రెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-07T06:46:46+05:30 IST