హరితహారంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-07-10T10:15:23+05:30 IST
హరితహారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుఉంటాయని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య హెచ్చరించారు.

అదనపు కలెక్టర్ చంద్రయ్య
మర్పల్లి : హరితహారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుఉంటాయని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య హెచ్చరించారు. మం డల పరిధిలోని పెద్దాపూర్, జంశెట్పూర్ గ్రామాల్లో పార్కులకు కే టాయించిన స్థలాలు, హరితహా రం మొక్కలు, డంపింగ్యార్డుల ను గురువారం ఆయన పరిశీలించారు. హరితహారంలో నాటిన మొక్కల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించరాదని, అలాంటి వారిపై చర్యలుంటాయని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీవో సురే్షబాబు, ఏపీయం అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.