త్వరలో ఆ ఇద్దరు టీఆర్ఎస్‌లోకి.. జోరుగా ప్రచారం

ABN , First Publish Date - 2020-05-11T16:30:10+05:30 IST

ఒకటి రెండు రోజుల్లో టీఆర్‌ఎ‌స్‌లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది...

త్వరలో ఆ ఇద్దరు టీఆర్ఎస్‌లోకి.. జోరుగా ప్రచారం

రంగారెడ్డి/కడ్తాల్‌ : కడ్తాల ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు సమాచారం. వైస్‌ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్‌, మరో ఇద్దరు ఎంపీటీసీలు, కొందరు సర్పంచులతో కలిసి ఒకటి రెండు రోజుల్లో టీఆర్‌ఎ‌స్‌లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో కమ్లీమోత్యనాయక్‌, బావండ్లపల్లి ఆనంద్‌ పార్టీలో చేరడానికి ఇప్పటికే రంగం సిద్ద మైనట్లు తెలిసింది. 



Updated Date - 2020-05-11T16:30:10+05:30 IST