శంషాబాద్లో భారీ చోరీ
ABN , First Publish Date - 2020-10-27T17:07:46+05:30 IST
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది.

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఉన్న ఇళ్లను టార్గేట్ చేసిన దుండగులు... ఓ ఇంటి తాళం విరగొట్టి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడు శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరికి గల ఆధారాల కోసం డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.