టీఆర్‌ఆర్‌ఐఎంఎస్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2020-03-16T06:25:55+05:30 IST

అనంతగిరిలోని కరోనా ఐసోలేషన్‌ కేంద్రాన్ని పటాన్‌చెరులో ఉన్న తన ఆసుపత్రికి మార్చాలని పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు.

టీఆర్‌ఆర్‌ఐఎంఎస్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

 వికారాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అనంతగిరిలోని కరోనా ఐసోలేషన్‌ కేంద్రాన్ని పటాన్‌చెరులో ఉన్న తన ఆసుపత్రికి మార్చాలని పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి చేవెళ్ల మాజీఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌తో కలిసి ఆయన మంత్రిని కలిశారు.


ఈ సందర్భంగా అనంతగిరిలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులు, భక్తులు తగ్గిపోతున్నారనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఐనోల్‌ వద్ద ఉన్న టీఆర్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 350 పడకలున్నాయన్నారు. అత్యవసర, సాధారణ పరిస్థితుల్లో వైద్యం చేయడానికి వీలుగా అన్ని సదుపాయాలు ఉన్నాయని వివరించారు. అనంతగిరి అభివృద్ధిని కాంక్షించి తమ ప్రతిపాదనకు అంగీకరించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.   

Updated Date - 2020-03-16T06:25:55+05:30 IST