అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-04-08T09:58:17+05:30 IST
కిరాణ షాపుల్లో నిత్యవసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే షాపు యజమానులపై చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయీస్

కులకచర్ల: కిరాణ షాపుల్లో నిత్యవసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే షాపు యజమానులపై చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయీస్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ సురేష్ తెలిపారు. మంగళవారం మణికంఠ కిరాణ షాపును తనిఖీ చేశారు. షాపు యజమాని, ప్రజలతో ఆయన మాట్లాడారు. ప్రతి షాపు వద్ద వస్తువుల ధర పట్టిక ఉంచాలని తెలిపారు. వస్తువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.