రైతులు కల్లాలను త్వరగా నిర్మించుకోవాలి

ABN , First Publish Date - 2020-11-13T09:35:12+05:30 IST

రైతులు కల్లాలను త్వరగా నిర్మించుకోవాలి

రైతులు కల్లాలను త్వరగా నిర్మించుకోవాలి

శామీర్‌పేట రూరల్‌: రైతులు కల్లాలను త్వరగా నిర్మించుకోవాలని సర్పంచ్‌ జ్యోతిబలరామ్‌గౌడ్‌ కోరారు. గురువారం ఎంసీపల్లి మండలం కేశవరంలో రైతుకల్లాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ద్వారా రైతులకు వందశాతం సబ్సిడీతో నిర్మిస్తున్న రైతు సిమెంట్‌ కల్లాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు అందుబాటులో ధాన్యం ఆరబెట్టడానికి కల్లాలు ఉపయోగపడుతాయని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ హన్మంతరెడ్డి, వార్డు సభ్యులు శ్రీశైలం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ టీఏ సూర్య, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ ఇంద్రసేనారెడ్డి, రైతులు రవి, మల్లేష్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T09:35:12+05:30 IST