బీజేపీ నాయకుల నియామకం
ABN , First Publish Date - 2020-11-13T09:30:58+05:30 IST
బీజేపీ కీసర మండల అధ్యక్షుడిగా దేశం మల్లే్షగౌడ్ నియామకమయ్యారు.
మేడ్చల్: బీజేపీ గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి చేతులమీదుగా విష్ణువర్ధన్రెడ్డి నియామకపత్రం అందుకున్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కొంపల్లి మోహన్రెడ్డి అమరం మోహన్రెడ్డి పాల్గొన్నారు.
కీసర మండల అధ్యక్షుడి నియామకం
కీసర: బీజేపీ కీసర మండల అధ్యక్షుడిగా దేశం మల్లే్షగౌడ్ నియామకమయ్యారు. కరీంగూడ గ్రామానికి చెందిన మల్లే్షగౌడ్ 1989వ సంవత్సరంలో బీజేపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి పలుహోదాల్లో పనిచేశారు. మల్లేష్ గౌడ్ సేవలను గుర్తించిన జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్రెడ్డి గురువారం తన నివాసంలో మల్లే్షగౌడ్కు నియమాకపత్రం అందజేశారు. తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.