చెరువుల పునరుద్ధరణకు ‘రీసైకిల్ ఫ్లోటింగ్ ట్రీట్మెంట్ వెట్ల్యాండ్’
ABN , First Publish Date - 2020-03-08T08:23:17+05:30 IST
చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవాటెల్ భాగసామ్యం ఏర్పర్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖతో...

శంషాబాద్ : చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవాటెల్ భాగసామ్యం ఏర్పర్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖతో కలిపి రీసైకిల్ ఫ్లోటింగ్ ట్రీట్మెంట్ వెట్ల్యాండ్(ఆర్ఎ్ఫటీడబ్ల్యూ) కార్యక్రమం అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఎకార్ హోటల్స్ ‘ఇయర్ ప్లానెట్ 21’లో భాగంగా చెరువుల పునరుద్ధరణ, వ్యర్థజలాల శుద్ధీకరణకు స్థిరమైన సాంకేతికతను వినియోగించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు నోవాటెల్ నిర్వాహకులు తెలిపారు. కాగా స్పెయిన్లోని మాడ్రిడ్లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్తో కలిసి ప్లాస్టిక్ బాటిళ్లను తేలియాడే వంతెన మాదిరిగా నిర్మించి దానిపై హైడ్రోఫోనిక్ మొక్కలు అమర్చి ప్లాంటు తయారు చేస్తారు. ఈ ప్లాంటు కాలుష్యమయమైన చెరువులను వేర్ల ద్వారా శుద్ధి చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నోవాటెల్ హోటల్ జనరల్ మేనేజర్ రూబిన్చెరియన్, తదితరులు పాల్గొన్నారు.