నజియా కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ధర్నా
ABN , First Publish Date - 2020-09-30T17:33:28+05:30 IST
ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న నజియా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం
రంగారెడ్డి: ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న నజియా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నజియా కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితుడు మధు యాదవ్ను ఉరి తీయాలని ఏబీవీపీ విద్యార్థులు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. వెంటనే అక్కడకు చేరుకున్న మొయినాబాద్ పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.