ధ్యానం.. సత్యజ్ఞాన ప్రసాదిని

ABN , First Publish Date - 2020-12-30T04:36:45+05:30 IST

ధ్యానం.. సత్యజ్ఞాన ప్రసాదిని

ధ్యానం.. సత్యజ్ఞాన ప్రసాదిని
కార్యక్రమానికి హాజరైన ధ్యానులు

  • ప్రపంచ ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీ 

ఆమనగల్లు : ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, సంకల్పశక్తి అని ప్రపంచ ధ్యాన గురువు, పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీస్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు సుభాష్‌ పత్రీజీ అన్నారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామసమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో ధ్యాన మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహిళా డిజిటల్‌ ధ్యాన మహాచక్రం-2 లో భాగంగా 9 రోజు మంగళవారం పత్రీజీ వేణునాథ ధ్యానంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పత్రీజీ ధ్యానులనుద్దేశించి మాట్లాడుతూ విశ్వశాంతి కోసం పిరమిడ్‌ ట్రస్టీ చేస్తున్న ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పిరమిడ్‌ ట్రస్టీ వైస్‌చైర్మన్‌ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, మేనేజింగ్‌ ట్రస్టీ రాంబాబు, సభ్యులు దామోదర్‌, సాంబశివరావు, నందప్రసాద్‌, ప్రేమయ్య, సురే్‌షబాబు, హన్మంతరాజు, నవకాంతు, పీఆర్‌వో రవిశాస్ర్తీ, జ్యోతిరెడ్డి, దీప్తిరెడ్డి, మాధవి, లక్ష్మీ పాల్గొన్నారు. ధ్యాన మహాసభలలో పలు రాష్ట్రాలకు చెందిన కళాకారుల నృత్యాలు, గురుకులం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం పిరమిడ్‌ సభా ప్రాంగణంలో ధ్యాన, ఆధ్యాత్మిక పుస్తకాలను పత్రీజీ ఆవిష్కరించారు. 

Updated Date - 2020-12-30T04:36:45+05:30 IST