ముద్ర ఉన్న ప్రతి ప్రయాణికుడుహోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే

ABN , First Publish Date - 2020-03-24T08:15:36+05:30 IST

దేశ, విదేశాల నుంచి వచ్చే వి మాన ప్రయాణికులు క్వారంటైన్‌ ముద్ర ఉంటే తప్పకుండా హోం క్వారంటైన్‌కు వెళాల్సిందేనాని శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి...

ముద్ర ఉన్న ప్రతి ప్రయాణికుడుహోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే

  • డీసీపీ ప్రకాశ్‌రెడ్డి 


శంషాబాద్‌ రూరల్‌: దేశ, విదేశాల నుంచి వచ్చే వి మాన ప్రయాణికులు క్వారంటైన్‌ ముద్ర ఉంటే తప్పకుండా హోం క్వారంటైన్‌కు వెళాల్సిందేనాని శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో డొమెస్టిక్‌ ప్రయాణికుల ను సోమవారం తనిఖీ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వస్తున్న ప్రయాణికులను చేతులకు వేసే  హోం క్వారంటైన్‌ ముద్రలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఐదుగురు ప్రయాణికులను వారి స్వస్థలాలకు పంపించారు. లక్నోకు చెందిన ఇద్దరు ప్రయాణికులు, జ గిత్యాల్‌కు చెందిన మరో ప్రయాణికుడు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన మ రో ఇద్దరిని హోం క్వారంటైన్‌కు తరలించారు. హోం క్వారంటైన్‌ ప్రయాణికులు 14రోజులు ఇళ్ల లోపలే ఉండాలని డీసీసీ తెలిపారు. కరోనా లక్షనాలు కలిగి ఉంటే వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తామన్నారు. ప్రభుత్వం విధిం చిన షట్‌డౌన్‌ను అందరూ పాటించాలని కోరారు. తనిఖీల్లో ఏసీపీ రవిచం ద్ర, ట్రాఫిక్‌ ఏసీపీ విశ్వప్రసాద్‌, ఎస్సైలు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-24T08:15:36+05:30 IST