ఎవరూ బయటకు రావద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-03-24T07:50:12+05:30 IST

కరోనాను రూపు మాపాలంటే.. ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను...

ఎవరూ బయటకు రావద్దు : కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనాను రూపు మాపాలంటే.. ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలన్నారు. ఉదయం 7నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూరగాయలు, నిత్యావసర వస్తు వుల దుకాణాలు తెరిచి ఉంటాయని చెప్పారు. వాటి కోసం ఇంటి నుంచి ఒక్కరే వెళ్లా లని సూచించారు. గుంపులుగా రోడ్లపైకి రావద్దన్నారు. ప్రభుత్వ ఇచ్చే రేషన్‌ బియ్యం, నగదును సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తుల మధ్య దూరం పాటిం చాలని తెలిపారు. ఐకమత్యంతో లాక్‌డౌన్‌ పాటిస్తే కరోనా వ్యాప్తిని అరికట్ట వచ్చని చెప్పారు.

Updated Date - 2020-03-24T07:50:12+05:30 IST