కోకట్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-12-06T04:53:14+05:30 IST
కోకట్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య
యాలాల : యాలాల మండలం కోకట్ సమీపంలోని ఓ పాలిషింగ్ యూనిట్లో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక ఎస్ఐ అశోక్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ మం డలం ఖాజా మహ్మద్పల్లి గ్రామానికి చెందిన వెంకటప్ప(52) తన కుటుంబ సభ్యులతో కలిసి రెండున్నరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం తాండూరు ప్రాంతానికి వచ్చాడు. కోకట్ సమీపంలోని ఓ పాలిషింగ్ మిషన్ వద్ద టీ కొట్టు ఏర్పాటు చేసుకుని వెంకటప్ప జీవనం సాగిస్తున్నాడు. ఆయన కొడుకు శ్రీనివాస్ ఆ పక్కనే గల పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నాడు. వెంకటప్పకు ఇద్దరు భార్యలు లక్ష్మీ, బాలమ్మ, ఇద ్దరు కుమారులు శివకుమార్, శ్రీనివాస్, ఇద్దరు కూతుర్లు అంజిలమ్మ, కవిత ఉన్నారు. శుక్రవారం రాత్రి వెంకటప్ప ఒక గదిలో నిద్రించగా, భార్యలు, కూతుళ్లు మరో గదిలో నిద్రించారు. కుమారులు పాలిషింగ్ యూనిట్ కార్యాలయ గదిలో నిద్రించారు. అర్ధరాత్రి ఏదో శబ్ధం రావడంతో భార్యలు వెళ్లి వెంకటప్ప గదిలో చూశారు. అప్పటికే వెంకటప్పను గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఇనుపరాడ్డుతో తలపై మోది హత్య చేసినట్లు వారు గుర్తించారు. ఈ విషయాన్ని వారు పాలిషింగ్ యూనిట్ వారికి సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించారని ఎస్ఐ అశోక్బాబు తెలిపారు. ఈ మేరకు శనివారం రూరల్ సీఐ జలందర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారని, సీఐ జలంధర్రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్బాబు పేర్కొన్నారు.